Manirathnam : లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ మూవీ కావడం.. చోళుల కాలం నాటి కథాంశంతో తీస్తున్నందువల్ల ఇప్పటికే అసాధారమైన అంచనాలు మొదలయ్యాయి. ఇక మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ప్రముఖ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా అదే టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
కాగా ఈ పాన్ ఇండియా సినిమాలో ఐశ్వర్యారాయ్ – కార్తీ – విక్రమ్ – జయం రవి – విక్రమ్ ప్రభు – త్రిష – శోభితా ధూళిపాళ్ల – ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం చెన్నై – హైదరాబాద్ – రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసింది చిత్ర బృందం. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా ఆ తర్వాత పుదుచ్చేరిలో మొదలు పెట్టి కీలకమైన షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ఇక తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు పెట్టినట్లు తాజా సమాచారం.
Manirathnam : ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ ని 2022 విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గ్రేప్ గార్డెన్ రోడ్ లో కార్తి – త్రిష – శోభిత దూళిపాళ్ల పాల్గొంటున్న సాంగ్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాటను దాదాపు రెండు వందలమంది డ్యాన్సర్లపై తెరకెక్కిస్తున్నారట. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ ని 2022 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన లోగో పోస్టర్ సినిమా మీద ఆసక్తిని పెంచేస్తోంది.