మంజుల ఘట్టమనేని సినీ నిర్మాతగా, నటిగా ఆమె ఎంతో పేరును తెచ్చుకున్నారు. ప్రముఖ కథానాయకుడు కఈష్ణ కూతురిగా సినీ రంగంలోకి ప్రవేశించింది. రాజస్థాన్ అనే సినిమా ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైంది. కాగా దాని తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా అవేవీ ఆమెకు పేరును తీసుకురాలేకపోయాయని చెప్పుకోవచ్చు. కాగా ఆమె సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకంటున్నారు మంజుల ఘట్టమనేని. కాగా మంజుల ఘట్టమనేని తన పుట్టిన రోజు సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మనసుకు నచ్చింది’ అనే మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమె నిరాశకుగురయ్యారు. సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి చవిచూడాల్సి వస్తుందని ఆమె వెళ్లడించారు. కాగా కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తానని ఆమె తెలిపారు. కాగా అనేక విషయాలను ఆమె పంచుకున్నారు. అందరికీ నేనంటే నటీగా, నిర్మాతగానే తెలుసు కాని నాలో దాగున్న కొన్ని ప్రత్యేక విషయాలు చాలా మందికి తెలియదు. వ్యక్తిత్వ వికాసం నిపుణురాలిగా నాకు మంచి అనుభవం ఉంది. అలాగే ధ్యానసాధకురాలిగా కూడా నేను ప్రపంచానికి ఎన్నో విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నాలోని ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను.
నేను నా జీవితంతో ఎదుర్కొన్న సమస్యలను, అనుభవాలను, నేను నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ప్రతి రోజూ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కూడా చేరుస్తూ ఉంటాను. ఫిట్ నెస్ విషయంలోనూ, హెల్త్ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తాను. హెల్త్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయను. దీనిని నేను మానాన్న నుంచి నేర్చుకున్నాను. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే విషయాలను సిరీస్ గా తయారుచేసి ప్రజలకు అందిస్తున్నాను. అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతున్నాను. కాగా ఈ కొత్త మలుపును నేను నా పుట్టిన రోజునే మొదలు పెడతున్నాను.
ఈ సందర్భంగా మంజుల ఘట్టమనేని మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెళ్లడించారు. ఫిట్ నెస్ తో పాటుగా అధ్యాత్మిక విషయాల పట్ల మహేశ్ కు మంచి అవగాహన ఉందని మంజుల తెలిపారు. కాగా ప్రతి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆమె తెలిపారు. అతనితో నేను కూడా అనేక విషయాల గురించి చర్చిస్తానని మంజుల తెలిపారు. అలాగే వారి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు. మహేశ్ తో ఒక సినిమాను తీసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపారు.