భారత్ లోకి చైనా బలగాలు చొరబడలేదని, మన పోస్టులేవీ వారి కభ్జాలో లేవని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రకరాకల విమర్శల వస్తున్న సంగతి తెలిసిందే! ఈ విషయాలపై తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. అఖిలపక్షంలో ప్రతిపక్షాల దగ్గర మాటరాకూడదనే క్రమంలో… శత్రుదేశానికి, ఆ దేశ వాదనలకు బలంం చేకూర్చేలా మాట్లాడకూడదని స్పష్టం చేస్తున్నారు!
ఈ నెల 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సొంగ్ స్పందించారు. ప్రధానమంత్రి చేసే ప్రతిప్రకటన, మాట్లాడే ప్రతిమాట జాతి భద్రత, వ్యూహాలు, భౌగోళిక ప్రయోజనాలపై ఎంత ప్రభావం పడుతుందన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.. చైనా ఒత్తిళ్లకు లొంగడం కానీ, మన భౌగోళిక సమగ్రత విషయంలో రాజీపడటం కానీ చేయకూడదని సూచించారు.
ఇదే సమయంలో కల్నల్ బి. సంతోష బాబుతో పాటు, మన వీర జవాన్లు చేసిన ఆత్మబలిదానాలకు ప్రధానమంత్రితోపాటు, కేంద్రం న్యాయం చేయాలని మన్మోహన్ సింగ్ సూచించారు.
కాగా… భారత్ లోకి చైనా బలగాలు చొరబడలేదని మోడీ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల… శతృదేశానికి బలం చేకూర్చినట్లవుతుందని, వారు చేసింది కరక్టే అనే అర్ధాలు ధ్వనిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి!