టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలంటే డా.డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్, నాగార్జున నడిపిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్, దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్. వీటితో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలంటే యూవి క్రియోషన్స్, మైత్రీ మూవీ మేకర్స్. ఈ రెండు నిర్మాణ సంస్థలలో ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు నిర్మిస్తున్నారు.
ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్ – వంశీ కృష్ణలు కలిసి నడుపుతున్న యూవి క్రియోషన్స్ లో మీడియం బడ్జెట్ సినిమాల నుంచి సాహో, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ అనే పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2021 సమ్మర్ కి రిలీజ్ చేయబోతున్నట్టుసమాచారం.
అయితే ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ నిర్మించే ప్రాజెక్ట్ ఏంటన్నది క్లారిటీ రావడం లేదంటున్నారు. అయితే ఇప్పటికే ముగ్గురు దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చారని తెలుస్తుంది. మేర్లపాక గాంధీ.. సుజీత్ ..మారుతి నే ఈ ముగ్గురు. అంతేకాదు హీరోలలో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నితిన్ – రవితేజ – అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లకి అడ్వాన్సులు ఇచ్చారట. అయితే వీరందరు ఇప్పుడు ‘రాధే శ్యామ్’ కోసం హోల్డ్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
‘రాధే శ్యామ్’ రిలీజైయ్యాకే ఈ దర్శకులు, హీరోల కాంబినేషన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసి మొదలు పెడతారని అంటున్నారు. అప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ మొదలవదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఒకరకంగా ‘రాధే శ్యామ్’ రిజల్ట్ మీదే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఆధారపడి ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతాయో ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళనున్నాయో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?