అమరావతి: రాష్ట్రంలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన పది మంది నేతలు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గురువారం ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు. ముందుగా వీరు బిజెపి జాతీయ నేత రామ్మాధవ్తో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.
కేంద్రంలో రెండవ సారి మోది నేతృత్వంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలను సిద్ధం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. కాంగ్రెస్, టిడిపి, జనసేన, టిఆర్ఎస్ పార్టీల నుండి నాయకులను చేర్చుకోవడం ప్రారంభించారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తొలుత టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహనరావు, టిజి వెంకటేష్లను చేర్చుకుని కాషాయం కండువా కప్పి రాజ్యసభలో టిడిఎల్పిని విలీనం చేసుకున్నారు. ఆ తరువాత పలువురు బిజెపిలో చేరినప్పటికీ చెప్పుకోదగిన నేతల చేరికలు జరగలేదు. కొద్ది రోజులుగా చేరికల రాజకీయం స్థబ్దుగా ఉంది.
తెలుగుదేశం నుండి మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రామినేని ఫౌండేషన్ అధినేత, గుంటూరు మాజీ జడ్పి చైర్మన్ పాతూరి నాగభూషణం, సీనియర్ నాయకుడు, విశాఖ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, గట్టి చిన్న సత్యనారాయణ, జనసేన పార్టీ నుండి చింతల పార్థసారధి, కాంగ్రెస్ పార్టీ నుండి బొబ్బిలి శ్రీనివాసరావులతో పాటు హైకోర్టు మాజీ న్యాయమూర్తి నక్కా బాలయోగి, పూతలపట్టు రవిలు తాజాగా కాషాయం కండువా కప్పుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?