Mars: దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మట్టి ఉచితంగా లభిస్తుంది. మేరువ తోలుకోవడానికి కూడా మట్టి ఉచితంగా పొందవచ్చు. ఉచితంగా లభిస్తుంది కాబట్టి మట్టికి పెద్దగా విలువ లేదు. కానీ అక్కడి మట్టి విలువ బంగారం కంటే చాలా అధికం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్కడి మట్టి విలువ ఏకంగా కోట్లలో ఉంది. మట్టి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి ఒక తులం మట్టి విలువ సుమారు రూ.729.38 కోట్లని అంచనా. ఈ ధర మేలిమి బంగారం కంటే సుమారు 1.44 లక్షల రెట్లు ఎక్కువ. మట్టికి ఇంత విలువ, అది ఎక్కడ అని అనుకుంటున్నారా అయితే ఇది చూడండి. అది ఎక్కడి మట్టి అంటే భూమికి దూరంగా అంగారక గ్రహాంపై ఉన్న మట్టి.
అంగారకుడిపై జీవరాసుల జాడ తెలుసుకునేందుకు నాసా “పర్సెవరెన్స్ రోవర్”ను పంపిన విషయం తెలిసిందే. అది ఈ ఏడాది ఫిబ్రవరిలో అరుణగ్రహంపైన, 49 చదరపు కిలో మీటర్లలో విస్తరించిన జెజీరో బిలం సమీపంలో దిగింది. ఒకప్పుడు ఆ నది ప్రవహించిన ఆ బిలం పరిసరాల్లోని మట్టిని సేకరించి, జీవరాసుల జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు దశల్లో అక్కడి నుంచి రెండు పౌండ్ల అంటే 907 గ్రాముల మట్టి నమూనాలను భూమికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మట్టి భూమిని చేరడానికి దశాబ్ద కాలం పట్టవచ్చని సమాచారం. రెండు పౌండ్ల మట్టిని తీసుకువచ్చేందుకు అక్షరాలా రూ. 65,643.84 కోట్లు అంటే 900 కోట్ల అమెరికా డాలర్లు ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి ఒక తులం (పది గ్రాములు) మట్టి ధర సుమారు రూ.729.38 అన్న విషయం అర్థం అవుతుంది.