అమరావతి: ఏపి రాజధాని వికేంద్రీకరణను సమర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.