Master : కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకి సినిమా ధియేటర్ లో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే గత ఏడాది అక్టోబర్ మాసంలో తెరుచుకున్న థియేటర్లు మళ్లీ మూత పడే అవకాశాలు ఉన్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. మేటర్ ఏమిటంటే సినీ నిర్మాతలకు అదేవిధంగా ఎగ్జిబిటర్లు మధ్య వివాదం రాజు కొన్నట్లు అందువల్లే థియేటర్లో క్లోజ్ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. బయటి లక్షలకు ఉండే హక్కులు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా వర్తింపజేయాలని థియేటర్ యాజమాన్యాల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ మాదిరే పర్సంటేజ్ సిస్టం అమలు చేయాలని అల్టిమేటం చేయాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పెద్ద సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత, చిన్న సినిమా విడుదల అయితే నాలుగు వారాల గ్యాప్ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలని థియేటర్ యజమానులు కోరుకుంటున్నారు. ఈ డిమాండ్లు గనక నెరవేర్చకపోతే మార్చి 1 నుండి థియేటర్లు క్లోజ్ చేస్తామని తెలంగాణ థియేటర్ల యాజమాన్యం సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య చర్చలు జరిగాయి.
ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రాబోయే వేసవిలో చాలా పెద్ద సినిమాలు రిలీజవుతున్న తరుణంలో థియేటర్ యాజమాన్య సంఘం తెరపైకి తెచ్చిన డిమాండ్లు కనుక ఒప్పుకొనక పోతే మార్చి మొదటి నుండి సరిగ్గా బిజినెస్ జరిగే టైం క్లోజ్ చేస్తామని థియేటర్ యాజమాన్యం హెచ్చరించడంతో డైలమాలో పడ్డారు నిర్మాతలు. కాగా తెలంగాణ థియేటర్ యాజమాన్యాల సంఘాలు ఈ విధంగా డిమాండ్ చేయడానికి గల కారణం “మాస్టర్” Master సినిమా ఎఫెక్ట్ అనే టాక్ వస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాని భారీ మొత్తం చెల్లించి కొన్న ఎగ్జిబిటర్లుకి సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో చాలా నష్టాలు రావడం జరిగింది. ఇంతలోనే సినిమా నిర్మాతలు..సినిమా థియేటర్లో ఉన్న సమయంలోనే సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసే విధంగా డిజిటల్ హక్కులు అమ్మేయడం తో..తెలుగు ఎగ్జిబిటర్లు ముందుగా జాగ్రత్త పడుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.