మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేకులు పడిన విషయం తెల్సిందే. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా తెలిపారు. ఇక ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను వదిలారు.
దీనికి అభిమానుల నుండి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆచార్య కథ మాదంటే మాదంటూ కొంత మంది వివాదం రాజేశారు. కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేసిన ఈ సినిమా కథ మీదేనని ఎలా అంటారు అంటూ ఇప్పుడు ఆచార్య నిర్మాతలు ప్రకటన విడుదల చేసారు. ఆచార్య కథ కొరటాల శివ ఆలోచన నుండి పుట్టుకొచ్చింది. కొరటాల శివ వంటి ఒక స్థాయి కల దర్శకుడిపై కాపీ అంటూ ఎలా వివాదం రాజేస్తారని మాట్నీ సంస్థ ప్రకటనలో తెలిపింది.