విజయవాడలోని ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారామా, చదువుల ఒత్తిడ, లేక వేధింపులా? అనేదాని పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ లోని భవానీపురము కి చెందిన మంగు నాగబాబు మరియు జయలక్ష్మి దంపతుల కుమార్తె దేవి ప్రియాంక. కొండపల్లిలోని జీ.ఎం.కే ల్యాబ్స్ లో నాగబాబు పనిచేస్తున్నారు. గుంటూరు లోని కాటూరి మెడికల్ కాలేజీలో దేవీ ప్రియాంక ఎండీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజు లాగానే కాలేజీకి నుంచి ఇంటికి వచ్చింది.
రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె తల్లితండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా ప్రియాంక మాత్రం ఇంటివద్దే ఉంది. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి తమ గారాలపట్టి ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. ఇంకా ప్రాణాలతోనే ఉందేమో అన్న ఆశతో వెంటనే అంబులెన్సు కు ఫోన్ చేశారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.
అయితే, ఆమె రూమ్ ని పోలీసులు పరిశీలించగా దేవి ప్రియాంక బెడ్ పక్కనే ల్యాప్ టాప్ మరియు ఆమె డైరీని చూడగా వారికి డైరీలో సూసైడ్ నోట్ కనిపించింది.
సూసైడ్ నోట్ లో “సారీ డాడీ, ఐ లవ్ యూ డాడీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం డాడీ, అమ్మా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. బాయ్ అమ్మా, బాయ్ నాన్నా. నవీన్ వల్లే నేను చనిపోతున్నా అని సూసైడ్ నోట్ లో రాసింది. పోలీసులు దేవి ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే, చిన్నప్పటి నుంచి దేవి ప్రియాంక ఒక మెరిట్ స్టూడెంట్. ఇప్పటికే నాలుగు ఐదు సంబంధాలు తీసుకొచ్చినా ఆమె అంగీకరించలేదట. ఆమె మరణం వెనుక ఉన్న కారణం తెలుసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.