హైదరాబాద్లో చేప మందు ప్రసాదం పంపిణీ గురించి అందరికి తెలిసిందే.. ఇలాంటి వెరైటీ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. తేళ్లు, తేనెటీగలు, నత్తల తో చికిత్స అందించే థెరపీలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బతికున్న చేపలో మందును పెట్టి, రోగి గొంతు లోపలికంటా వదిలేస్తారు . ఇలా చేయడం వలన ఆస్తమాతో పాటు శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయట. హైదరాబాద్ లో మృగశిర కార్తె ఆరంభం లో ఈ చేప మందు పంపిణి జరుగుతుంది .
ఇండోనేషియాలోని రవా బువాయలో ఓ ట్రాక్ పై రైలు వెళ్తుండగా.. మరో ట్రాక్ పై జనం పడుకుంటారు. అప్పుడు ట్రాక్ నుండి వచ్చే విద్యుత్ శక్తి అనేక రోగాలను తగ్గింస్తుందని ఇక్కడి వారి నమ్మకం .
టోక్యోలోని ఓ బ్యూటీ సెలూన్ లో ముఖంపై నత్తలు పాకిస్తారు. ఇలా 5 నిమిషాల పాటు నత్తలను పాకించడం వలన నత్త విడుదల చేసే శ్లేష్మం మృత కణాలను తొలగిస్తుంది. దాని వలన చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందని వారి నమ్మకం .
కంబోడియాలోని కందల్ లో వాత రోగానికి తాబేలు తో చికిత్స చేస్తారు. ఆవులు, తాబేళ్లు, పాముల కు అతీంద్రియ శక్తులు ఉంటాయని కంబోడియా ప్రజల నమ్మకం .
కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు ఈజిప్ట్ లో ఇలా వెరైటీ ట్రీట్ మెంట్ ఇస్తారు. బాగా ఎండగా ఉన్నప్రాంతంలో ఇసుకలో పూడ్చడం వలన నపుంసకత్వ సమస్య ఉన్న కూడా దూరమవుతుందట. కైరోలోని సివా ఒయాసిస్ లో ఈ తరహా థెరపీ చేయించుకుంటారు .
వెన్నెముక, వినికిడి లోపం, ముక్కుకి సంబందించిన సమస్యలకు గాజా లో తేనెటీగల థెరపీ చేస్తారు. తేనెటీగల్లో ఉండే విషం ఈ సమస్యలను దూరం చేస్తుందని పాలస్తీనియన్స్ నమ్మకం .
రష్యాలోని సైబీరియాలో చిన్నారులు ఐస్ వాటర్ తో స్నానం చేస్తారు . ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవడంతో పాటు పిల్లలు మంచి ఫిట్ గా తయారవుతారట .