మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఎప్పుడు సమాజం కోసం ఏదో ఒకటి చేస్తూనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రజలను చైతన్య పరుస్తూ పలు ఆరోగ్య సూచనలు ఇస్తూ మరోపక్క ఎవరూ పట్టించుకోని జంతువులను పట్టించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బాగా ఐశ్వర్యవంతులు కుటుంబంలో పుట్టిన కానీ మానవత్వంతో పేద వారి పట్ల కనికరం చూపుతూ అనేక చారిటీ సంస్థలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాసన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఫిలింనగర్ లో సినీ కార్మికులకు సొంత సంస్థ అపోలో మెడికల్ షాప్ నందు ఉచిత మెడిసిన్ అందించడం జరిగింది.
ఇదిలాఉండగా తాజాగా ఇటీవల ఉపాసన శ్రీశైలం టూర్ వెళ్లిన సందర్భంలో అక్కడ భగవంతుని ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఓ మంచి కార్యక్రమం చేపట్టింది. అదేమిటంటే శ్రీశైలం అడవుల్లో ఉండే గిరిజనుల దగ్గరకు వెళ్లి వారికి ఆరోగ్య సూత్రాలు తెలపడం జరిగింది. ఏ విధంగా అంటురోగాలు రాకుండా మనిషి బతకాలి, శుభ్రంగా ఎలా ఉండాలి, ఇలా అనేక రీతిలో వారికి అర్థమయ్యే విధంగా ఉపాసన చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ గిరిజన ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు జీవన విధానం అన్ని విషయాలు తెలుసుకొని లాక్డౌన్ సందర్భంగా వాళ్లకి నిత్యావసర సరుకులు మరియు కొద్దిగా ఆర్థిక సాయం ఉపాసన చేసినట్లు సమాచారం. దీంతో ఉపాసన ఈ విధంగా గిరిజనులకు సాయం అందించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కి తగ్గ మెగా కోడలు ఉపాసన అని ఆమె దయా హృదయాన్ని మెగా అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.