మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆచార్య చిత్రీకరణ త్వరలో తిరిగి ప్రారంభం అవనుందట. రీసెంట్ గా ఆచార్య నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ లో సమ్మర్ రిలీజ్ అని అధికారకంగా ప్రకటించారు కూడా. ఈ సినిమా తర్వాత 2021 లో చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అది ముందు అనుకుంటున్న మలయాళ సూపర్ హిట్ రీమేక్ ‘లూసీఫర్’ అని అందరూ అనుకున్నారు.
కాని తాజా సమాచారం ప్రకారం లూసీఫర్ కంటే ముందు మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో రీమేక్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చిరంజీవి ఫ్యాన్స్ ను గత కొన్ని రోజులుగా తెగ కంగారు పెట్టాయి. కారణం మెహర్ రమేష్ కి ఫ్లాప్ డైరెక్టర్ అన్న పేరుండటమే. తను తీసిన సినిమాలన్ని అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి. దాంతో పదేళ్లుగా ఒక్క సినిమా అవకాశం రాలేదు. దాంతో మహేష్ కొందరు హీరోల సినిమాలకి కథా చర్చలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దర్శకులకు అసోసియేట్ గా ఉన్నాడు.
మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవిని ఒప్పించిన మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలను చాలా మంది నమ్మలేదు. అలాగే ఎన్.టి.ఆర్ తో కూడా సినిమా ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇది కూడా కొందరు నందమూరి అభిమానులని కంగారు పెట్టింది. ఇక మెగాస్టార్ కోసం పూరి జగన్నాధ్ లాంటి దర్శకులుంటే కూడా మెహర్ రమేష్ నే ఎందుకు చిరు ఎంపిక చేసుకున్నాడన్నది ఇప్పుడు చాలా మందికి అర్థం కావడం లేదు. ఇక చాలామంది ఇది నమ్మలేదు. కాని పవర్ స్టార్ పొరపాటున టాప్ సీక్రెట్ ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చాడు. దాంతో మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారేంటీ అని అయోమయంలో పడ్డారట.