Mega Studio: గత కొన్ని నెలలుగా AP రాజకీయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. కరోనా కష్టకాలం తరువాత తెలుగు సినీ పరిశ్రమకు అతి పెద్ద దెబ్బ పడింది. ఆర్ధిక మాంద్యంతో టాలీవుడ్ తలకిందులైంది. ఇక తీరా కరోనా పోయింది అనుకొని హమ్మయ్య, అని ఊపిరి పిలుచుకొని లోపే ఏపీ సర్కార్ చిత్ర పరిశ్రమపైన పెద్ద గుదిబండ పడేసింది. అదేనండి.. టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ ఒక జీవోను పాస్ చేసింది. ఇక అక్కడినుండి అనేక ఇక్కట్లు పడుతోంది టాలీవుడ్. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రిని పలుమార్లు కలవడం జరిగింది.
Bank Rules: కొత్తగా మారిన బ్యాంక్ విధివిధానాలు తెలుసుకోండి.. పెనాల్టీ లేకుండానే విత్డ్రా!
Mega Studio: చిరు కలయిక ఎందుకోసం?
అందరూ అనుకున్నట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమ మేలుకోరి అయన ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ దిగ్గజాలు జగన్ చెంతకు వెళ్లడం, ఆయన సాఫ్ట్ గా స్పందించడం జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్ వారిని కోరిన కోరిక ఇపుడు పలు ఆలోచనల్లో పడేసింది. టాలీవుడ్ మొత్తాన్ని విశాఖకు సిఫ్ట్ అవ్వమని కోరడం, అలాగే వారి స్టూడియోలను ఏపీలో నిర్మించేందుకు స్థలాలు ఇస్తానని అనడం వెనక వున్న కారణాలను పలువురు విశ్లేషిస్తున్నారు.
Mutual Funds: రూ.160 డిపాజిట్ చేయండి.. రూ.10 లక్షలు పొందండి!
తాజా సమాచారం:
మెగాస్టార్ చిరంజీవి ఏపీలో ఓ బడా స్టూడియో నిర్మించనున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అదే దారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పయనించనున్నారని వినికిడి. ఆ ప్రణాళికలో భాగంగానే పనిలో పనిగా సీఎం జగన్ ని వారు కలిసారని ఓ వర్గం వారు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా.. ఏపీ సీఎం జగన్ కోరిక కూడా అదే అయినపుడు వారు కలవడంలో తప్పేముందని కొందరు వాదిస్తున్నారు.