Megastar chiranjeevi : సైరా సినిమా తర్వాత చిరంజీవి సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో లో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే..
చిరు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. మోహర్ రమేష్ తో వేదలమ్ సినమా ను రీమేక్ చేస్తున్నారు.. దీని తరువాత మోహన్ రాజా దర్శకత్వం లో లూసిఫర్ సినిమాను రీమేక్ చేయనున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా చిరంజీవితో ఒక సినిమా చేసేందుకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారని సమాచారం..
తాజాగా మరో ఇద్దరు అండ్ డైరెక్టర్స్ కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలని భావిస్తున్నారు.. ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఎవరో కాదు అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల.. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఇద్దరు డైరెక్టర్స్ మెగాస్టార్ కోసం కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే వెంకీ కుడుముల చిరంజీవికి ఒక లైన్ చెప్పారని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమని మెగాస్టార్ చెప్పారట.. ఈ యంగ్ డైరెక్టర్ చిరు కోసం ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తారో చూడాలి మరి.. నిజంగా న్యూస్ అభిమానులకు పండగే.. సైరా మూవీ తో ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నారు దీని తర్వాత వరుస సినిమాలు వస్తాయంటే అభిమానులకు గుడ్ న్యూసే గా మరి..