ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ ప్రకటించడానికి వచ్చిన తరుణంలో, ఎవరైతే ఇండస్ట్రీలో రాణించాలని ఎదురుచూస్తున్నారు వారందరికీ చిరంజీవి భరోసా ఇవ్వడం తెలిసిందే. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలో కష్టపడి రావటం తో ఆ కసి మిగతా వారిలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ.. చిరంజీవి వేదికపై మాట్లాడుతూ అనేక మందిని ఎంకరేజ్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో మెహబూబ్ ని చూసి నీలో మంచి రాపో డాన్సింగ్ టైం ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. అంత మాత్రమే కాక నీలో నన్ను చూశాను అంటూ భారీ డైలాగ్ వేశారు. మెహబూబ్ ఇంటి కష్టాలు తెలుసుకొని పది లక్షల చెక్కు కూడా వేదికపై ఇవ్వటం జరిగింది. అంత మాత్రమే కాక సోహైల్ ఇస్తానన్న 5లక్షలు ఇవ్వొద్దని.. తానే 10లక్షలు ఇస్తున్నానని సడెన్ సర్ ప్రైజ్ చేశారు చిరంజీవి. ఇదిలా ఉంటే చిరంజీవి కొరటాల శివ తో చేస్తున్న ఆచార్య సినిమాలో మెహబూబ్ కోసం ఒక చిన్న పాత్రను కూడా ఇచ్చారట.
మంచి బేస్ ఉన్న పాత్రని ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తోంది. ఇది గనుక క్లిక్ అయితే మెహబూబ్ స్టార్ మారినట్టే. మరోపక్క సోహెల్ కూడా మెహబూబ్ తో అదేవిధంగా అఖిల్ తో కలిసి సినిమా చేయాలని తన కోరిక అని చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా సినిమా చేయడం గ్యారెంటీ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లగా అడుగుపెట్టిన చాలామంది.. బయటకొచ్చాక ఇండస్ట్రీ నుండి అవకాశాలు అందుకోవడం విశేషం.