Polavaram Project : విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలావరకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 శాతం ప్రజలు ఏపీలో వ్యవసాయం పైనే ఆధారపడిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో రైతులకు తన ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తూ జగన్ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ..పాలన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాలు అదేరీతిలో విత్తనాలు సకాలంలో అందేలా పంట నష్టపోయిన గాని ప్రభుత్వం కొనే విధంగా జగన్ రైతులకు మేలు చేసే రీతిలో ఆలోచన చేస్తూ రాణిస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో అతిపెద్ద కీలక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం విషయంలో ముందు నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ జగన్ తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో పాలకులు.. ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాలలో తెలపడం జరిగింది.
కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారంలోకి వచ్చాక టెండర్ ద్వారా మేఘా కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులను అప్పజెప్పడం తెలిసిందే . ఈ క్రమంలో మేఘా పోలవరంపనుల విషయంలో కీలకమైన పనులను స్పీడ్ గా చేసుకుంటూ పోతుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు అతి కీలకమైన ఘట్టం స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపు 52 పిల్లర్లు 52 మీటర్లు నిర్మాణం పూర్తి చేసింది. స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గాను ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. అదే రీతిలో స్పిల్వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డలు 192 కాగా ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. కట్టమీద స్పిల్ వే పనులకు సంబంధించి ఇంకా కొద్దిపాటి బ్యాలెన్స్ అని మాత్రమే మిగిలి ఉండటంతో .. దాదాపు పోలవరం ప్రాజెక్టు పనులు క్లైమాక్స్ కి చేరుకున్నట్లు ప్రాజెక్టు నిపుణుల వ్యాఖ్యానిస్తున్నారు. కచ్చితంగా జగన్ సర్కార్ నిర్దేశించిన టైం కల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవడం గ్యారెంటీ అని టాక్ గట్టిగా వినబడుతోంది.