సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే టక్కున ఆడియన్స్ చెప్పే పేర్లు మెహబూబ్, సోహెల్. ఇద్దరూ ఫిజికల్ టాస్క్ విషయంలో గాని హౌస్ లో ఒకరు ఓడిపోతే మరొకరు ఎంకరేజ్ చేసుకోవటంలో గాని.. కొన్ని విషయాలలో సపోర్ట్ చేసుకోవటంలో గాని ఒకరి గురించి ఒకరు జాగ్రత్తలు తీసుకోవడంలో గాని త్యాగం చేసుకుంటూ గేమ్ ఆడటం చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది.
అయితే ఇద్దరిలో సోహెల్ టాప్ ఫైవ్ లో కి వెళ్లి ప్రైజ్ మనీ గెలుచుకోగా మెహబూబ్ ముందుగానే హౌస్ నుండి ఎలిమినేట్ కావటం చాలామంది నిరాశపరిచింది. కానీ గ్రాండ్ ఫినాలే రోజు నాడు వీరిద్దరి స్నేహానికి నాగార్జున మరియు చిరంజీవి ఫిదా అయి చెరోక్కరికి 10 లక్షల చొప్పున ఇద్దరికీ ఇరవై లక్షలు ఇవ్వటం జరిగింది. ఇటువంటి తరుణంలో అనేక ఇంటర్వ్యూలలో ఇద్దరూ నాగార్జున గురించి అదే విధంగా చిరంజీవి గురించి మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలుపుతూ జన్మలో వాళ్ల రుణం తీర్చుకోలేము అని సోహెల్, మెహబూబ్ చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇద్దరు ఇటీవల చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మెగాభిమానులు.. ఖచ్చితంగా ఇద్దరికీ ఇండస్ట్రీ పరంగా చిరంజీవి మంచి లైఫ్ ఇస్తారని కామెంట్లు చేస్తున్నారు.