మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాపై మెగాభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శివ ట్రాక్ రికార్డ్ అటువంటిది. అయితే ఒక దర్శకుడి పేరు చెబితేనే ఇప్పుడు మెగాభిమానులకు కంగారు పుడుతోంది. ఆ దర్శకుడి ట్రాక్ రికార్డ్ అటువంటిది మరి.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అజిత్ హీరోగా తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వేదాళం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఆ దర్శకత్వ బాధ్యతలను మెహర్ రమేష్ కు అప్పగించాడు చిరు. అయితే మెహర్ టాలీవుడ్ లో కొన్ని కళాఖండాల్ని తెరకెక్కించాడు. శక్తి, షాడో వంటి సినిమాలు మెహర్ దర్శకత్వంలో వచ్చినవే. అంతకుముందు బిల్లా, కంత్రి తీసినా అవేమంత చెప్పుకునే సినిమాలు కావు. ఈ నేపథ్యంలో మెహర్ తో సినిమా వద్దూ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల పెడుతున్నారు.