కరోనా లాక్డౌన్ వల్ల దేశంలోని అన్ని రంగాలతోపాటు ఆటోమొబైల్ రంగం కూడా భారీగా నష్టాలకు గురైంది. కానీ అన్లాక్ 1.0 నుంచి ఆ పరిశ్రమ కొద్దిగా కోలుకుంటోంది. అయితే జనాలు కొత్త వాహనాలను కూడా పాత వాహనాలను కొనుగోలు చేసేందుకే ఆసక్తిని చూపిస్తున్నారట. కరోనా నేపథ్యంలో ప్రజా రవాణాకు భయపడి చాలా మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి వారు కొత్త వాహనాలు కాకుండా సెకండ్ హ్యాండ్ వాహనాలనే ఎక్కువగా కొంటున్నట్లు వెల్లడైంది.
మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్, కార్స్ 24, డ్రూమ్ వంటి కంపెనీలు సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎక్కువగా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారులు తమ కార్లను ఈ కంపెనీలకు అమ్మవచ్చు. వీలుంటే ఎక్స్ఛేంజ్ మొత్తం పోను మరో ప్రీ ఓన్డ్ కారును సొంతం చేసుకోవచ్చు. లేదా వారు ఆ కారుకు ఇచ్చే మొత్తంతో మళ్లీ కొత్త కారు కొనుగోలు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. నిజానికి కరోనా ముందు కూడా సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగానే వృద్ధి చెందుతోంది. అయితే కరోనా నేపథ్యంలో జనాలు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో.. ఇప్పుడీ వ్యాపారానికి మరింత డిమాండ్ ఏర్పడింది.
సదరు ప్రీ ఓన్డ్ కార్లను అమ్మే కంపెనీలు ఈ మధ్య కాలంలో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లు బాగా పెరిగాయని తెలిపాయి. కరోనా ముందున్న బిజినెస్తో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లు 250 శాతం వరకు పెరిగాయని డ్రూమ్ వెబ్సైట్ తెలిపింది. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, హోండా సిటీ, ఐ10, మహీంద్రా స్కార్పియో వంటి వాహనాలనే వినియోగదారులు సెకండ్ హ్యాండ్లో ఎక్కువగా కొంటున్నారని తేలింది. అయితే గతంలో సెకండ్ హ్యాండ్ వాహనాలను ఫైనాన్స్ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య 20 శాతం ఉంటే ఇప్పుడు 35 శాతం అయింది.
జూన్ 2019 కన్నా జూన్ 2020లోనే సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగిందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉన్నప్పటికీ సరఫరా లేదని.. కొత్త కార్లను కొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున.. వారు తమ పాత కార్లను అమ్మడం లేదని.. కనుక పాత కార్ల సరఫరా తక్కువగా ఉందని తెలిపారు. ఇక దేశంలో ఉన్న మెట్రో నగరాల్లో సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే మళ్లీ కొత్త కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?