చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్స్.. భారతదేశ మార్కెట్ లో ప్రవేశించిన కొద్ది కాలంలోనే మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంది.. ఎంజీ హెక్టార్, ఎం జి గ్లోస్టర్, ఎంజి జెడ్ఎస్ ఈవి ఉత్పత్తులు మంచి లాభాలను సాధించినట్లు కంపెనీ పేర్కొంది.. కరోనా క్లిష్ట కాలంలో కూడా మంచి లాభాలను సాధించడం కస్టమర్ల వల్లనే సాధ్యం అయిందని తెలిపింది.. ఈ సంవత్సరంలో రిటైల్ అమ్మకాలు వివరాలు ఇలా ఉన్నాయి..
2020 డిసెంబర్ లో ఎంజి మోటార్స్ అత్యధికంగా 4010 యూనిట్లను విక్రయించింది. దీని పరంగా వార్షిక వృద్ధి 33శాతం అభివృద్ధి సాధించింది. ఈ నెలలో సాధించిన అభివృద్ధి సంవత్సరం మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ డిసెంబర్ 2020 లో రిటైల్ అమ్మకాలు 3430 యూనిట్లు హెక్టర్ మోడల్ నుంచి వచ్చాయని, మిగతా 580 యూనిట్లు జి ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్లు తెలిపింది . 2019 అమ్మకాలతో పోలిస్తే 77 శాతం విక్రయాలు పెరిగినట్లు ఎంజి మోటార్స్ తెలిపింది.
ఎంజి గ్లోస్టర్ ప్రీమియం ఎస్యువి విడుదలైన రెండు నెలల్లోనే 1085 యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం విశేషం. ఎంజి హెక్టర్ 25000 యూనిట్లు, జిఎస్ ఈవీలు 1243 అమ్మకాలను నమోదు చేశాయి. అంతేకాకుండా ఈ మోడళ్లకు విపరీతమైన బుకింగ్స్ వచ్చాయని, ఎంజీ హెక్టార్ కు 5000 యూనిట్లు, జిఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ కోసం 200 యూనిట్ల బుకింగ్స్ ఉన్నాయని కంపెనీ వివరించింది. కొత్త సంవత్సరంలో భారత్ మార్కెట్ కోసం ఎంజి మోటార్ సెవెన్ సీటర్ వెర్షన్, ఎంజి ప్లస్ ఎస్ యు వి , పెట్రోల్ పవర్ ఎనర్జీ ఎస్ యు వి లను సూపర్, షార్ప్ అనే రెండు వేరియంట్స్ విడుదల చేయనున్నట్లు ఎంజి మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రాకేష్ సిదానా తెలిపారు.