Microwave oven:ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ Microwave oven ఉంటుంది. చేసిన వంట వేడిచేయడం, బేకింగ్ వంటి వాటికి ఉపయోగించే మైక్రోవేవ్ ప్రస్తుతం ప్రతి ఇంట్లో ముఖ్యమైన వస్తువుగా అయిపోయింది. ఈ ఆధునిక జీవనం లో చాలా ఇళ్లలో బార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. అటువంటి వారు వంట చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటం వలన మైక్రోవేవ్ వాడేస్తున్నారు.
మైక్రోవేవ్లో ఆహారాన్ని వేడి చేయడం వంట చేయడం సురక్షితమా? లేక ప్రమాదమా? అనే అంశంపై ఎప్పటి నుంచో సందేహం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్ల ద్వారా చల్లారిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేయడం, వేడినీరు, ఇడ్లీ, కూరగాయలు వంటి వాటిని ఆవిరి చేయడానికిచాలా తేలికగా ఉంటుంది. మైక్రోవేవ్లో వంట మూలాన రుచితగ్గడం తో పాటు ఆహారం లోని పోషకాలు నశించిపోతాయి. అంతేకాక మైక్రోవేవ్ ఓవెన్ వాడటం వల్ల ప్లాస్టిక్ కంటైనర్ల నుంచి వచ్చే రసాయనాలు ఆహారం లో కలుస్తాయి. దీని వలన మన శరీరానికి విపరీతమైన హాని కలిగే అవకాశం ఉంది.
ఆకుకూరలు, ఇతర పదార్థాలను వాడటం మూలాన మన ఆహారంలో మంచి పోషకాలు లభ్యమవుతాయి. కూరగాయలను కోసిన తర్వాత వాటిని కడగడము వలన విటమిన్లు నీటిలో కరిగిపోయి బయటకు పోతాయి. ఎక్కువ సేపు లేదా ఎక్కువ వేడి లో వంట చేయడం వలన కూడా ఆహారం లో పోషకాలు నశించిపోతాయి. అదే విధంగా మాంసం వేయించడం ప్రమాదకరమైన నైట్రోసమైన్ల ఉత్పత్తికి దారితీస్తుంది. కాబట్టి మైక్రోవేవ్లో మాంసం వేడిచేయడం మంచిది కాదు.
మైక్రోవేవ్ వంటలోని పోషకాలను కూడా ప్రభావితం చేస్తుంది. మైక్రోవేవ్లో తీవ్ర స్థాయిలో వేడి ఉంటుంది. అంత వేడిలో ఆహారాన్ని వేడి చేయడం మూలాన విటమిన్ బి 12 దెబ్బతింటుంది. ఆకుకూరలను నీటి లో ఉడకబెట్టినప్పుడు ఫోలెట్ విటమిన్ పోతుంది. కాని మైక్రోవేవ్లో లో వండినప్పుడు నష్టాన్ని 77% వరకు తగ్గించవచ్చు. వంట త్వరగా అవడానికి కుక్కర్ ,ఓవెన్ లాంటివి వాడేస్తున్నాము. ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం ఓపికతో స్టౌ మీద ఉడికించుకుని చేసుకోవడం మంచిది.