Kumbh Mela: ఎలా ప్రయాణం చేసి
హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం (Triveni Sangamam) లోనూ జరిగే కుంభమేళా లో కొన్ని లక్షల మంది నాగ సాధువులు రావడం టీవీ లో చుస్తూఉంటాము వారు ఎలా ప్రయాణం చేసి అక్కడకు వస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా?నాగసాధువులు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో తెలుసుకుంటే ఈ విషయం కూడా మనకు అర్ధం అవుతుంది. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలోనో , కొండల్లోనో , నదీ తీరాల్లోనో సాధన చేసుకుంటుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ ఎక్కడ కనిపించరు.ఇంకా చెప్పాలంటే హిమాలయాల (Himalayas) కు కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుం,టాయి.
Kumbh Mela: ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి
సరిగా ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. కొన్ని లక్షలలో దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరంప్రయాణం చేస్తే వాళ్ళు ప్రయాణం చేసిన దారి అంతా ట్రాఫిక్ జామ్ (traffic Jam) అవ్వాలి.. ఇప్పటి దాకా ఎప్పుడు ఎక్కడ అలాంటి సంఘటన జరిగినట్టు రికార్డ్ అవ్వలేదు. పోనీ అది కాదు అన్న వారు ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు దాటుకుని రావలిసి ఉంటుంది. ఎక్కడైనా,ఏ ఫోటోకి అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు చిక్కారా ? ఇంతమంది ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసారు అన్న ఆనవాలు ఉందా?లేదుకదా… అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశం కు ఎలా చేరుకుంటున్నారు?కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతున్నారు ? ఆ ప్రాంతంలో కాకుండా ఎక్కడ వారి జాడ కనిపించ పోవడానికి కారణం ఏమిటి ?ఈ సందేహం మీకు ఉందా అయితే సమాధానం తెలుసుకోండి..
సూక్ష్మ శరీర యానం
నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి వాడే ప్రయాణ సాధనం సూక్ష్మ శరీర యానం… ఎన్నో సంవత్సరాలుగా మన కళ్ళ ముందు ఇంత నగ్న సత్యం కనిపిస్తుంటే అది నమ్మడానికి మనకు చిన్న తనం.దేవుడు ఉన్నాడా అనేవారికి ఇది ఒక సమాధానం అనే చెప్పాలి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదివి వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. వాటిలో ఉన్న మంచి మంచి విషయాలను అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చేస్తే మీ జీవితం ఎంతో మందికి ఆదర్శం గా ఉంటుంది.