ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. రాజస్థాన్ (జైపూర్) లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదివారం రాత్రి అసదుద్దీన్ ఇంటికి చేరుకున్నారు. రాళ్ల దాడి జరిగినట్లుగా పనివాళ్లు చెప్పారు. తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారనీ, ఈ దాడిలో కిటికీలు దెబ్బతిన్నాయని అసదుద్దీన్ డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2014 నుండి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారనీ, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసద్ ట్వీట్ చేశారు. అసదుద్దీన్ నివాసం ఉండే అశోకా రోడ్డు ఢిల్లీలోని హైసెక్యురిటీ జోన్ ఉంది. ఎంపి ఫిర్యాదుతో ఢిల్లీ డీసీపీ అసద్ నివాసాన్ని సందర్శించి రాళ్ల దాడి ఆధారాలను సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసద్ డిమాండ్ చేసారు.
హైదరాబాదీ రియల్టర్ శ్రీధర్ రావును అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు .. ఏ కేసులో అంటే..?