పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు.. పది మందితో ఛీ అనేలా ప్రవర్తిస్తున్న రోజులివి! తాజాగా శాసనమండలి లో జరిగిన వ్యవహారం చూసినవారెవరికైనా అదే ఆలోచన రావడం ఖాయం. పైగా దానిపేరు పెద్దల సభ… అలా ప్రవర్తించే వారు చాలా అరుదైపోయిన సభ అది! అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న ఆ శాసన సభలో ముఖ్యంగా టీడీపీ నుంచి… అశోక్ బాబు, బాబు రాజేంద్రప్రసాద్, యనమనల రామకృష్ణుడు, లోకేశ్ ల ప్రవర్తనపై తెగ విమర్శలు వస్తున్నాయి!!
ఈ క్రమంలో తాజాగా వారు ప్రవర్తించిన తీరు, చేసిన చేష్టలు, పలికిన మాటలు మరీ అసహ్యంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విమర్శల్లో కూడా ఒక పద్దతి ఉండాలన్న విషయం మరిచి మరీ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంంలో తాజాగా వారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై చేసిన విమర్శలే మరీ అతిగానూ అసహ్యంగానూ ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకూ అదేమిటంటే… ఫ్యాంట్ జిప్పు పెంట!!
మంత్రి అనీల్ కుమార్పై “మహిళల ముందుకు వెళ్లి షర్ట్ ఇప్పి జిప్ తీసి చూపించారని” టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై నిప్పులు చెరిగిన అనీల్… అశోక్ బాబు, రాజేంద్రప్రసాద్, లోకేష్ దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి… చైర్మన్ దగ్గరకు వెళ్ళి వీడియోలు తీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి.. అలా నిరూపించకపోతే రాజీనామా చేస్తానని లేఖలు ఇవ్వండి అంటూ సీరియస్ అయ్యారు. దాంతో తమ్ముళ్లు సైలంట్ అయిపోయారు. అంటే… పెద్దల సభలో విమర్శలు ఎంత చిల్లరగా తయారవుతున్నాయో అర్ధమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!
అయితే సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రూల్స్ కి విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీశాడని దానిని అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. అనీల్ ఈ సందర్భంగా ఫైరయ్యారు!