సిద్దిపేట నియోజకవర్గంలో భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతేకాకుండా మూడు ఎకరాలు 45 కోట్ల రూపాయలతో ఐటి హబ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల నియోజకవర్గం లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి దానికి కెసిఆర్ నగర్ గా పేరు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కెసిఆర్ చేతుల మీదగా పంపిణీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో తల పెట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరించారు.
మెట్టు పల్లి గ్రామంలో రైతు వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం తో పాటు వెయ్యి పడకల ఆసుపత్రి శంకుస్థాపన, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు నక్లెస్ రోడ్డు ప్రారంభం, సీసీ రోడ్డు, పోలీసు ఔట్ పోస్ట్, పిల్లల కోసం పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫంక్షన్ హాల్ అన్ని హుంగులతో కూడిన గృహాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దాదాపు 278 కోట్ల 50 లక్షల రూపాయలతో 328 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తనని తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే… రికార్డు సృష్టించే విధంగా భారీ మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట నియోజకవర్గాన్ని గట్టిగానే అభివృద్ధి అయ్యేలా హరీష్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.