ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం జగన్ కన్న కలల్లో బలమైనవి ఒకటి సంక్షేమ పథకాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అర్హులందరికీ అందాలని.. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని! మొదటి కలకు కరోనా రూపంలో ఎన్నో సమస్యలు వచ్చి జగన్ ని పరీక్షించినా… ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని జగన్ చేసి చూపించారు. ఈ క్రమంలో రెండో కల… పరిశ్రమలు తెచ్చే విషయంలో మేకపాటి సైలంట్ గా చేసుకుంటూపోతున్నారు!!
పబ్లిసిటీ వద్దు.. పనిచేసుకుపోవడమే ముద్దు అన్నచందంగా పరిపాలన సాగిస్తున్న జగన్ సర్కార్ విషయంలో… తాజాగా మేకపాటి గౌతం రెడ్డి చేసిన పనులు మరో ఉదాహరణగా మారాయి!! ఈ నేపథ్యంలోనే జపాన్కు చెందిన అనేకపరిశ్రమలతో ఏపీ పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి చర్చలు జరిపారు. తద్వారా జపాన్ కు చెందిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు సానుకూలంగా స్పందించాయి. ఫలితంగా రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్ డెవలప్ మెంట్, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్ సంస్థల భాగస్వామ్యం పెరగబోతోంది. ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగనున్నాయి.
ఫలితంగా జగన్ భావిస్తున్నట్లుగా ముందుగా ప్రకటించిన రాష్ట్రవ్యాప్తంగా ఏడు పోర్టుల నిర్మాణం విషయంలో జగన్ సర్కార్ సీరియస్ గా స్పందిస్తున్నట్లే లెక్క. ఇదే క్రమంలో విశాఖను ఐటీ హబ్బ్ గా మార్చే విషయంలో కూడా జగన్ సర్కార్ ముందుకు కదులుతుంది. అలాగే… ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం భాగస్వాములను చేసుకోబోయే జపాన్ కంపెనీలద్వారా… సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్ అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు పరిపూర్ణమైన అవకాశం ఉంటుంది అనేది పెద్దలు చెబుతున్న మాట.
సో… ఇంతకాలం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను “జనాల అకౌంట్లలో డబ్బులు వేయడం మినహా జగన్ చేసిందేమీలేదు” అని.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇకపై ఆప్షన్ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి విషయాల్లో జగన్ దూసుకుపోతే ఇక ఎలాంటి ఇబ్బందులూ ఉండవనేది వారి మాటగా ఉంది!