Peddi Reddy : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి కి మధ్య గట్టిగానే కోల్డ్ వార్ జరిగింది అని చెప్పవచ్చు.
ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి నిమ్మగడ్డ తీసుకుంటున్న చాలా నిర్ణయాలను తప్పు పట్టడమే కాక రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడా లేని విధంగా చంద్రబాబు బంట్రోతు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన పై మండిపడ్డారు. దీంతో నిమ్మగడ్డ పెద్దిరెడ్డి నీ హౌస్ అరెస్ట్ చేయాలంటూ మీడియాతో కూడా మాట్లాడకుండా గృహనిర్బంధం చేయాలని ఆదేశాలు పోలీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఏంటో తన హక్కులను కాలరాస్తున్న ట్లు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో పిటిషన్ వేసిన పెద్దిరెడ్డి కి హైకోర్టు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో పెద్దిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. విషయంలోకి వెళితే పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడకూడదు అంటూ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు రేపు విచారణ చేయడానికి రెడీ అయ్యింది. సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో హైకోర్టు ఈ విషయంపై విచారణ చేసి ఎలాంటి తీర్పు ఇస్తది అన్నది ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ గా నెలకొంది. మరోపక్క పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలి అనే రీతిలో వైసీపీ ప్రభుత్వం ముందునుండి కీలక నిర్ణయాలు తీసుకోవడం మరోపక్క నిమ్మగడ్డ తనదైన శైలిలో అడ్డుపడుతూ వచ్చారు. ఇదిలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక .. సంవత్సరాలు నడుస్తున్న క్రమంలో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రజాతీర్పు.. ఏ విధంగా ఉంటుంది అన్నది ఉత్కంఠభరితంగా ఉంది.