NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sidiri Appalaraju : మంత్రి సీదిరి స్పీడు మామూలుగా లేదుగా!పలాస లో ఫటాఫటా పాలిటిక్స్!!

Sidiri Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. మంత్రి సీదిరి అప్పల్రాజు సమక్షంలో ఆ ఇద్దరు వైసీపీ కండువా కప్పుకున్నారు. 21వ వార్డు అభ్యర్థి దేవరశెట్టి బాలాజీ గుప్తా వైసీపీలో చేరిపోయారు. అలాగే 26 వార్డు బీజేపీ అభ్యర్థి మళ్లా రమ్య ఫ్యాన్ గూటికి చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీ తరుఫున నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు.

 Minister Sidiri Appalaraju Speed ​​is not normal!
Minister Sidiri Appalaraju Speed ​​is not normal!

Sidiri Appalaraju : మంత్రి గారా ?మజాకా?

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలిచి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని కైవసం చేసుకునేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్న టీడీపీ నుంచి నలుగురు కౌన్సిలర్ అభ్యర్ధులను వైసీపీలో చేర్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చిన మంత్రి.. తాజాగా బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీలో జాయిన్ చేసేసుకుని కమలం పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను 135 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 9 వార్డులకు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరిని వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో లాగేయడంతో ఇప్పుడు మిగతా అభ్యర్ధులు ఉంటారా లేక వారూ జెండా పీకేస్తారా అనే చర్చ జరుగుతోంది.

ఇంత దిక్కుమాలినతనమా:లోకేశ్!

వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.. టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ అని ఆరోపించారు. తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయమని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయమని.. అందుకే పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని.. నువ్వొక నాయకుడివి.. నీదొక పార్టీ.. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!