Nimmagadda Ramesh Kumar : స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అధికార పార్టీ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చినప్పటి నుండి..ఈ క్షణం వరకు వైయస్ జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు నిమ్మగడ్డ. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే గడిచిన రెండు మూడు నెలలలో భారీ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ మర్చిపోలేని రీతిలో కౌంటర్లు న్యాయ పరంగా అదేవిధంగా ప్రకటనల పరంగా ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో అటు వైసీపీ ప్రభుత్వానికి చెందిన నాయకులు మంత్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల విషయంలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు అవ్వకుండా కీలకంగా రాణిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయంలో తాజాగా ఏపీ కీలక శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టేట్ మొత్తం షాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మాట ఎవరైనా వింటే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని రీతిలో హెచ్చరికలు జారీ చేశారట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా పంచాయతీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే..మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తప్పవని పెద్దిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతటి ఉన్నత అధికారులు అయినా చట్టపరంగా నడుచుకోవాలని..సూచించడం జరిగింది.
అందుకుగాను ఏకగ్రీవల విషయంలో వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. అట్లా కాదని రిటర్నింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం బ్లాక్ లిస్టులో ఉంటారని ఊహించని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంతంగా అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ఫిబ్రవరి 9 వరకు వాడకూడదని హైకోర్టు స్పష్టం చేయటం హైలెట్ విషయంగా మారింది. వైసీపీ పార్టీ నాయకులు ముందు నుండి ఈ యాప్ విషయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో కోర్టు కూడా ఈ యాప్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసే తరహాలో ఆపేయటం తో వైసీపీ మద్దతు దారులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.