(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి).
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మళ్లీ ఆనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హెలికాఫ్టర్ లో హైదరాబాదుకు తరలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ – హైదరాబాదు మధ్య వాహనాల రాకపోకలకు నిలిచిపోవడంతో హెలికాప్టర్ లో మంత్రి వెల్లంపల్లిని హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ కు తరలించారు.
గత నెల చివరి వారం మంత్రి వెల్లంపల్లి కరోనా బారిన పడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లి వచ్చిన మరుసటి రోజే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులకే ఆయనకు కరోనా తగ్గిపోవడంతో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే నేడు జ్వరం, నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు.