(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినా.. కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని అలివేలు మంగాపురం వద్ద 16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి బైక్పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్కూటర్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు వెంకటేశ్, రాజమోహన్ గా గుర్తించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.