Mirabai Chanu: ప్రతిష్టాత్మకమైన టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత మువ్వన్నెల జెండా మెరిసింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి పతకం సాధించి ఈసారి ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరిచింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో mirabai chanu భారతదేశానికి తొలి పతకం తెచ్చిపెట్టింది.
శనివారం జరిగిన ఈ పోటీల్లో మొత్తంగా మీరా బాయి 202 కేజీల బరువు ని మోసింది. అందులో 87 కేజీలు స్నాచ్ పద్ధతిలో మోయగా మిగిలిన 115 కేజీలు క్లీన్ అండ్ జెర్క్ పద్ధతిలో మోయగలిగింది. నాలుగుసార్లు ప్రయత్నించిన మీరా చాను కొద్దిలో పసిడి చేజార్చుకుంది అనే చెప్పాలి.
చైనాకు చెందిన జిహుయ్ హో 210 కేజీలు మోసి కొత్త ఒలింపిక్ రికార్డు స్థాపించింది. mirabai chanu ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే పసిడే గెలిచేది అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ వెండి పథకం గెలవడం అనేది నిజంగా గొప్ప విషయం. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్ వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్స్ పతకం గెలిచింది.
ఇక ఇండోనేషియాకు చెందిన విండి కంటికా ఐశా 194 కేజీల బరువుని ఎత్తి కాంస్య పతకం సాధించింది. భారత్ ప్రధాన విభాగాలు అయిన అయినా బాక్సింగ్, వ్రెస్ట్లింగ్, బ్యాడ్మింటన్, ఆర్చరీ ఫలితాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?