Danapur Express : ధానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ధానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు స్టేషన్ ఘన్పూర్ లోని రైల్వే గేటు దాటిన తరువాత ఇంజన్, బోగిని కలిపి ఉన్న లింకు ఊడిపోవడంతో ఇంజన్ నుండి బోగీలు విడిపోయి ముందుకు వెళ్లింది.
సుమారు 250 మీటర్ల వరకూ ఇంజన్ వెళ్లిపోయింది. దీంతో స్టేషన్ ఘన్పూర్ రైల్వే గేటు వద్ద రైలు బోగీలు ఆగిపోయాయి. దీంతో రైలులోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. అనంతరం రైల్వే సిబ్బంది బోగీల నుండి కొద్ది దూరం వెళ్లిపోయి అగిన ఇంజన్ ను తీసుకువచ్చి తిరిగి తగిలించారు. సుమారు అరగంట పాటు స్టేషన్ ఘన్ పూర్ లో బోగీలు నిలిచిపోయాయి.