శ్రీవిజయా ఎయిర్ ప్లేన్ 59మందితో ప్రయాణిస్తుండగా కనిపించకుండాపోయింది. శనివారం ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా నుంచి బయలుదేరిన విమానం మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఫ్లైట్ SJ182 మార్గంలో వెళ్తోన్న విమానం ట్రాకింగ్ కు దొరక్కుండా మిస్ అయిపోయింది. దాని సిగ్నల్ కోల్పోతున్న సమయంలో జకార్తాకు ఉత్తరదిశ తీరం వైపుకు వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి.కాగా 59మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో ఐదుగురు పిల్లలు, ఓ పసిపాప ఉన్నట్లు ప్రముఖ మీడియా చెప్తుంది.అలాగే ఇద్దరు పైలట్లతో పాటు, నలుగురు క్రాబిన్ క్రూ ప్రయాణిస్తున్నారు..ఈ విమానం సోకర్నో-హత్తా ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది.వెస్ట్ కలిమంతన్ రాజధాని పొంటియానక్ వైపుగా వెళ్లాల్సి ఉంది.కాగా 737-500మధ్య విమానం బోయింగ్ అవుతూ ఉందని,టేకాఫ్ అయిన ఒక్క నిమిషంలోనే విమానం 10వేల అడుగుల ఎత్తుకు చేరిందని ఫ్లైట్ రాడార్ 24 అనే మీడియా సంస్థ ట్వీట్ చేసింది.
అయితే విమానం కూలిపోయిందని చెప్పడానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ శనివారం రాత్రి వరకు ఏమీ లేదు.కానీ వేల ఐలాండ్స్ ఉన్న రెజెంట్ ప్రాంతంలో ఏదో పడి పేలినట్లుగా అనిపించిందని చెప్తున్నట్లు ఇండోనేషియా పేపర్ రాసుకొచ్చింది. అస్పష్టంగా ఉన్న ఫొటోలలో నీళ్ల మాటున ఉన్న ఏదో వస్తువు కనిపిస్తోంది అది కనిపించకుండా పోయిన విమానమేమో అధికారులు పరిశీలించాలని లోకల్ మీడియా చెప్తుంది. అయితే సోకర్నో-హత్తా ఎయిర్పోర్ట్ బ్రాంచ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ హేరుల్ అన్వర్ మాట్లాడుతూ.. శ్రీవిజయ ఎయిర్ప్లేన్ లాన్సాంగ్ ఐలాండ్ చుట్టూ ఉన్న ప్రాంతంలో సిగ్నల్ కోల్పోయిందని మాత్రమే ధ్రువీకరించారు.అంతకి మించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ విమానం జాడ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.ఈ లోపుగా ఎలాంటి వదంతులు వ్యాపింపజేయొద్దని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయరాదని ఆయన మీడియా సంస్థలను కోరారు.