Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి అనేక ప్రజాకర్షక నిర్ణయాలు అక్కడి జనాల ప్రేమను పొందారు. కానీ ఒక్క సారిగా ఏమైందో ఏమో కానీ ఆ రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ మీద కోపమొచ్చింది. ఎంతలా అంటే ట్విటర్ లో గో బ్యాక్ స్టాలిన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ప్రజలు ట్రెండ్ చేస్తున్నారు.
అసలేమైందంటే…
ఇటీవల తమిళనాడు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఇది ప్రతి ఏడూ జరిగేదే. ఇలా వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ సీఎం స్టాలిన్ చాలా విస్తృతంగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఆ చర్యలు ఎలా జరుగుతున్నాయో అని తెలుసుకునేందుకు దగ్గరుండి సమీక్షించారు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్న జనం కాస్త స్టాలిన్ ను వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల స్టాలిన్ ప్రభుత్వం సిమెంటు బస్తా రేటును 360 రూపాయల నుంచి 520 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అసలే వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు నిత్యావసర వస్తువుగా ఉన్న సిమెంటు బస్తాల రేటును ఎలా పెంచుతారంటూ అక్కడి ప్రజలు స్టాలిన్ పై విరుచుకుపడుతున్నారు. తమ బాధ దేశం మొత్తం తెలిసేలా గో బ్యాక్ స్టాలిన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విటర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
మొన్నటి దాకా దేవుడు…
నిన్న, మొన్నటి దాకా తమిళనాడు ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునే దేవుడిలా సీఎం స్టాలిన్ ను అభివర్ణించారు. పెట్రోల్ చార్జీలపై సెస్ ను కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గించి, రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయినా కానీ తమిళనాడు ప్రభుత్వం సెస్ తగ్గించలేదు. మునుపటి విధంగానే ఉంచింది. ఈ విషయంలో కూడా ప్రజలు గుర్రుగా ఉన్నారు. సెస్ తగ్గించి ప్రజలకు పెట్రో చార్జీల భారం తగ్గించాల్సింది అలా చేయలేదని స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.