Stalin: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్షాలు అని నేరుగా చూడకుండా వారిని కూడా కలుపుకుంటూ పోతూ.. తమిళనాడు ప్రజలకు న్యాయం చేసేలా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరచడమే కాకుండా చప్పట్లు కొట్టేలా చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రిజర్వేషన్ కోటా కల్పిస్తూ గత కొన్ని రోజుల క్రితం స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం దానికి ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకె సైతం ఆమోదం తెలపడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ 24 గంటలు పని చేస్తూ ఉండే పోలీసుల విషయంలో స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. విషయంలోకి వెళితే పోలీసులు ఏఏ జిల్లాలలో విధులు నిర్వహిస్తూ ఉంటారో… ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా.. ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయంతో వేలాది మంది తమిళనాడు పోలీసులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. అంతేకాకుండా ప్రస్తుతం అమలు చేస్తున్న రిస్క్ అలవెన్స్ నీ.. ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లు మరియు హెడ్ కానిస్టేబుల్ ఒక వారం రోజుల పాటు అదనంగా సెలవులు మంజూరు చేస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రతి ఏడాది ఉచితంగా పనిచేస్తున్న పోలీసులతో పాటు వారి భార్యలకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేరీతిలో చెన్నైలో థౌజండ్ లైట్స్ ప్రాంతంలో… దాదాపు రెండు వందల డబ్భై ఐదు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా పోలీస్ కోటర్స్ అన్ని సదుపాయాలతో ఉండే రీతిలో నిర్మించనున్నట్టు… ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ ప్రకటించిన ప్రకటనలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.