Pattabhi: టీడీపీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి(Pattabhi) సీఎం వైఎస్ జగన్(ys Jagan) ని ఉద్దేశించి ఏకవచనంతో.. దారుణమైన బూతులు తిట్టడం తెలిసింది. దీంతో పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పట్టాభి(Pattabhi) చేసిన వ్యాఖ్యల కారణంగా.. వైసిపి పార్టీ(YSRCP) శ్రేణులు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి దిగడంతో చంద్రబాబు ప్రస్తుతం 36 గంటల పాటు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వైయస్ జగన్ ని ఉద్దేశించి దారుణంగా బూతులు తిట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు.. ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు “జనగ్రహా” దీక్షలు చేపడుతున్నారు.
ఈ తరుణంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఆధ్వర్యంలో.. జరిగిన నిరసన కార్యక్రమంలో పట్టాభి పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ లో వైయస్ జగన్ ని ఉద్దేశించి విమర్శలు చేసి ఉంటే.. సీమ ప్రజలు అతని అడ్రస్ లేకుండా చేసి ఉండేవారని.. పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపించేస్తే… జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి పట్టిన గ్రహణం మొత్తం పోతుంది అని స్పష్టం చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వెనక లో చంద్రబాబు లోకేష్ హస్తం ఉందని పేర్కొన్నారు.
పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై కామెంట్స్
మా నాయకుడు ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరని తప్పనిసరిగా దాడి చేస్తారని హెచ్చరించారు. పట్టాభి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని మహిళలు చెప్పుతో కొట్టినా గాని వాళ్లకి బుద్ధి రాదు అని పేర్కొన్నారు. వైయస్ జగన్ ని విమర్శించి ఏదో రీతిలో ప్రజల్లోకి పోవాలని.. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూడలేక కుట్రలు పొందుతున్నారని ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేతిరెడ్డి జోస్యం చెప్పారు.