(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కోటంరెడ్డికి హైబిపితో అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శ్రీధర్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్లు కోటంరెడ్డిని పరామర్శించారు.