ఏపి, తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహాలం నెలకొంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న పది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపిలో నారా లోకేష్, భగీరథ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణ పదవీ కాలం ముగియనున్నది.
అలానే తెలంగాణలో నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవనున్న ఈ పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 13 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 14న నామినేషన్ల పరిశీలిస్తారు. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్