అమరావతి: ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే రోజా నియామితులయ్యరు.
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలో మంగళగిరి ఆటోనగర్ లో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవడంతో రోజా మనస్తాపానికి గురయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికీ గైరు హాజరయ్యారు. అనంతరం సిఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రోజాతో మాట్లాడి క్యాబినెట్ ర్యాంకు పదవి హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ హామీ మేరకు ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.