(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ తేదీ – 7 ఆగస్టు 2019
నామినేషన్ల స్వీకరణ – 14 ఆగస్టు 2019
స్క్రూటినీ – 15 ఆగస్టు 2019
నామినేషన్ విత్ డ్రా – 19 ఆగస్టు 2019
ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు – 26 ఆగస్టు 2019
ఆగస్ట్ 28వ తేదీ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాలి కృష్ణ శ్రీనివాస్, కొలగట్ల వీరభద్రస్వామిల రాజీనామాతో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో యాదవ రెడ్డి నామినేషన్ అనర్హత కారణంగా ఏర్పడిన స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.