Mobile Data : ప్రస్తుతం భారత దేశంలో అధిక శాతం ప్రజలు 4జి మొబైల్ డేటా ను వాడుతున్నారు. ఇది వచ్చిన కొత్తల్లో స్పీడ్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా వైఫై రూటర్లు, ఫైబర్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ స్పీడ్ కూడా జనాలకు సరిపోవట్లేదు. ప్రపంచదేశాలు 5జి పైన ప్రధానంగా దృష్టి పెట్టగా మన దేశంలో ఇంకా 4g డేటా స్పీడ్ వాడుతున్నారు.
మొబైల్ టవర్ నుండి దూరంగా ఉన్న ప్రదేశాన్ని బట్టి, 4జి మొబైల్ వినియోగదారుల సంఖ్య ఒకే ఏరియా లో ఎక్కువగా ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా రాత్రివేళ నెట్ ఎక్కువ స్పీడ్ గా రావడం పగటివేళ పూర్తిగా తగ్గిపోవడం వంటి కష్టాలనుకూడా వినియోగదారులు అనుభవిస్తుంటారు. అయితే ఈ డేటా స్పీడ్ పెంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి.
ముందుగా మొబైల్ లో ఉండే నెట్వర్క్ సిగ్నల్ సెట్టింగ్ లో కొన్ని మార్పులు చేయాలి. 4g ఓల్డ్ పనిచేసే మొబైల్స్ సంఖ్య పెరగడంతో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. మొదట ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్వర్క్ల ద్వారా 4జి ని ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్ కు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఆ తర్వాత ఏపీఎన్ ను డిఫాల్ట్ గా రీసెట్ చేయాలి.
ఇక మొబైల్ ఫోన్ లో తరచూ ఉపయోగించే యాప్స్ ను మాత్రమే ఉంచాలి. అనవసర యాప్స్ ను, ఎక్కువగా వాడని యాప్స్ ను తీసి వేస్తే మంచిది. బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్ నిలిపివేయాలి. అప్పుడు ఇంటర్నెట్ వేగం ఇంకా పెరుగుతుంది. నెట్వర్క్ సెట్టింగ్ చేయడం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగంగా లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది.