అమరావతి, ఫిబ్రవరి 8: శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో ప్రధమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఫోరెనిక్స్ ల్యాబ్ వాహనాలను చంద్రబాబు ప్రారంభించారు.
ఆయన ప్రసంగంలో అంశాలు:
ఇవి రాష్ట్ర వ్యాప్తంగా నేర నిర్ధారణ, దర్యాప్తునకు సాంకేతిక సాయం అందించనున్నాయి.
టీమ్ టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్లాం.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సత్పలితాలు ఇస్తోంది.
తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, జైలుకు పోతామనే భయం ఉంటే నేరాలు తగ్గుతాయి.
సాంకేతికను వినియోగించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలవాలి.