Modi: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యధికంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం కావడంతో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గెలవాలని ప్రధాన పార్టీలు ఎవరికివారు వ్యూహాలు వేసుకుంటూ ఉన్నారు. ఎస్ పి, బి ఎస్ పి, కాంగ్రెస్ పార్టీ అదే రీతిలో అధికార పార్టీ బిజెపి .. ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కరోనా అదేరీతిలో ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేయడంతో.. కేంద్రం పై వ్యతిరేకత ఉన్నట్లు ఒక పక్క వార్తలు వస్తూ ఉండగా ఇదే సమయంలో యూపీలో.. ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సర్వేలలో.. వస్తున్న ఫలితాలు విపక్షాలకు.. కొంచెం ఊరట కలిగిస్తూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీఘర్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ లాభాలు.. ఉంటాయి అంటూ యూపీ దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధికి అడ్డంకిగా ఉండేదని అప్పట్లో అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆకర్షించటం.. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మంచి వాతావరణం కల్పిస్తే అవసరమైన వనరులు.. అవే వస్తాయని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో రాష్ట్రంలో గుండాలు పరిపాలించే వారిని వారికి అంతా అవినీతి పాలన అని.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అదే రీతిలో మాయావతి లపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే సమయంలో అటువంటి దోపిడీదారులు అవినీతిపరులు కలిగిన నాయకులు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు అని పేర్కొన్నారు. ఒకానొక టైంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో అవినీతి భయంకరంగా జరిగేదని అటువంటి నాయకులకే.. అప్పట్లో ప్రభుత్వాలు పదవులు కట్టబెట్టేవని.. ఆ రోజులు ప్రజలు మర్చిపోరు అని ప్రస్తుతం రాష్ట్రంలో.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తోంది అంటూ మోడీ కొనియాడారు.