గల్వాన్ లోయ లో కొద్ది రోజుల క్రితం భారత్ – చైనా రక్షణ దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మృతి చెందినప్పటి నుండి సరిహద్దులో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. దీనితో తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతం వద్ద ఇరు దేశాలు భారీ ఎత్తున సైనికులను మోహరింపజేశాయి.
చైనా వారు అయితే ఏకంగా బుల్దౌజర్ లు వేసుకొని సరిహద్దు ప్రాంతమంతా తిరుగుతుండగా భారత మేమేమన్నా తక్కువా అన్నట్లు యుద్ధ విమానాలను నడిపారు. ఇలా రెండు దేశాల మధ్య మరికొద్దిరోజులు ప్రతిష్టంభన కొనసాగగా చివరికి దేశాలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాయి.
గల్వాన్ లోయలో 14, 15, 17 పాయింట్ల వద్ద రెండు దేశాలు సైనిక దళాలను ఉపసంహరించుకున్నాయి. ఇకమీదట ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ సైనికులు ఉంటే కచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఘర్షణ జరిగే అవకాశం ఉండడం…. అది తీవ్ర అవాంతరాల కు దారి తీస్తుంది కాబట్టి ఇరు దేశాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి.
అయితే ప్రధానమంత్రి మోడీ తన నివాసంలో ఇప్పుడు అదే విధంగా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ కు పిలిచారు. దేశంలోని లాక్ డౌన్ సడలింపుల పై మళ్లీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చైనా సరిహద్దుల్లో భవిష్యత్తులో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా జరపవలసిన కార్యాచరణపై కూడా వారు చర్చించనున్నారు.