20 మంది ఇండియన్ సోల్జర్స్ ని పొట్టనబెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అని, వివాదాలను ఎప్పుడు కోరుకోదు అని కానీ రెచ్చగొడితే మాత్రం సైలెంట్ గా ఉండబోము అని అన్నారు. దీటుగా బదులు ఇస్తామని ఈ విషయంలో వెనక్కి అడుగు వేసే ప్రసక్తి లేదని చైనా కి స్ట్రాంగ్ మెసేజ్ మోడీ ఇచ్చారు. అంతేకాకుండా భారత్ సార్వభౌమాధికారం పై రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపిన మోడీ జవాన్ల ప్రాణత్యాగం వృధాకాదని.. చైనాకు తగిన బుద్ది చెబుతామని తెలిపారు.
చైనా దుస్సాహసానికి బదులు చెప్పి తీరుతామన్నారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని 2నిమిషాలపాటు మౌనం పాటించారు. మరోపక్క ఈ ఘర్షణలో చైనా దేశానికి చెందిన సైనికులు 36 మంది చనిపోయినట్లు అమెరికా మీడియా సంస్థ తెలిపింది. మొత్తంమీద చూసుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉందని అమెరికా మీడియా న్యూస్ వైరల్ చేస్తోంది. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంపై ఎప్పటికప్పుడు అత్యవసర సమావేశాలు భారత్ ఆర్మీ కి చెందిన పెద్దలతో జరుపుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.