రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర బడ్జెట్ ను విడుదల విషయం తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో విడుదలైన ఈ బడ్జెట్ చాలా సమతూకంగా ఉందని జగన్ సర్కార్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి.
అయితే ఇప్పుడు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఇదే సమయంలో భారీగా నిధులు రావడం ఆంధ్రప్రదేశ్ కు కలిసొచ్చే అంశం. అలాగే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా 2020-21 ఏడాదికి సంబంధించి స్థానిక సంస్థలకు అనగా గ్రామీణ అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది.
దీని కింద ఆంధ్రప్రదేశ్కు ₹ 656.25 కోట్లు, తెలంగాణకు ₹ 461.75 కోట్ల నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక పోతే 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఈ గ్రాంట్స్ విడుదల చేస్తున్నట్లు తెలిపింది. 28 రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 15,187.50 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.