ఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు:
- ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం.
- అయిదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. ఆరు వేలు ఆర్థిక సాయం
- నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ
- రెండు వేల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లింపు
- పేదలైన 12కోట్ల మందికి రైతులకు ప్రయోజనం
- 2018 డిసెంబర్ నుండి ఈ పథకం ద్వారా ప్రయోజనం
- ఆదాయపన్ను పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంపు
- సెక్షన్ 80సి పరిమితి లక్ష రూపాయల నుండి లక్షా 50వేలకు పెంపు
- ఇళ్ల కొనుగోలుదారులకు జిఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం
- మంత్రివర్గ ఉప సంఘం నివేదికను జిఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటాం.
- ప్రధాన మంత్రి శ్రమయోగి పేరుతో పింఛన్ పథకం
- అసంఘటిత రంగంలోని పది కోట్ల మంది కార్మికులకు వర్తించనున్న పథకం
- నెలకు వంద రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తరువాత మూడు వేల రూపాయల పింఛన్ పథకం
- ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలు
- కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు
- పశుసంవర్థక, మత్స్య పరిశ్రమలకు రెండు శాతం వడ్డీ రాయితీ
- సినిమా ధియేటర్లపై జిఎస్టి 12శాతానికి తగ్గింపు
- బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి క్లెయిములు:
- నరేంద్ర మోది సారధ్యంలో సుస్థిర పాలన అందించాం.
- రైతులకు సాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
- అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
- ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకువెళుతున్న ఇండియా
- ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం
- 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4శాతం
- కరెంటు అకౌంట్ లోటును 5.6శాతం నుండి 2.5శాతానికి తగ్గించాం
- మూడు లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రికవరీ చేశాం
- బ్యాంకులకు 2.60లక్షల కోట్ల మూలధన నిధులు అందించాం
- అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదిదే
- అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాం
- ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 60వేల కోట్ల రూపాయలు కేటాయింపులు
- గ్రామ సడక్ యోజనకు 19వేల కోట్లు
- గడచిన నాలుగేళ్లలో 1.53కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం
- మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా
- ఎల్ఈడి బల్పులతో దేశంలో 50వేల కోట్లను ఆదా చేశాం
- ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్యతరగితి ప్రజలకు 3వేల కోట్ల ఆదా
- కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులు తీసుకువచ్చాం
- 22రకాల పంటలకు మద్దతు ధరను పెంచాం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?