కరోనా కట్టడి చేయడంలో ఇంకా అదే విధంగా ఇటీవల ఎలక్షన్లలో గెలవడంతో తిరుగులేదు మోడీ సర్కార్ కి అనుకుంటున్న తరుణంలో పార్లమెంట్ కమిటీ బాంబు లాంటి వార్త పేల్చింది. మేటర్ లోకి వెళ్తే వైద్యరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఫెయిల్ అయినట్టు పార్లమెంట్ కమిటీ ఒకటి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఒక నివేదిక సమర్పించింది.
వైద్యరంగంలో చేస్తున్న ఖర్చులను పూర్తిస్థాయిలో ఎండగట్టింది. వైద్యరంగం విషయంలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం వెనకబడి పోయిందని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే విషయంలో కూడా గోరంగా విఫలం అయినట్లు దీంతో కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల వద్ద డబ్బులు బాగా వసూలు చేస్తున్నట్లు గుర్తించింది దీంతో వైద్యులు కూడా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
దీనంతటికి కారణం వైద్యరంగానికి కేంద్రం నిధులు కేటాయించ లేకపోవడమే అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇండియా పక్కనే ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు … భారత్ కంటే మెరుగుగా వైద్యరంగం మిషన్ లో డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ వస్తే గనుక… మరణాల శాతం దేశంలో ఎక్కువ అవుతుందని నివేదికలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో కూడా సరైన సదుపాయాలు లేని పరిస్థితి ఉండటంతో సామాన్యులు కూడా అష్టకష్టాలు పడ్డే పరిస్థితి ఉంటుందని ఈ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిస్తే వైద్య రంగం మీద దృష్టి పెడితే సామాన్యుల ప్రాణాలు భవిష్యత్తులో కాపాడిన వారవుతారు అని పార్లమెంటరీ కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో వెల్లడించింది.